8 బంగారు పతకాలు బెంగళూరు వర్శిటీలో పనిమనిషి కూతురికి...
- January 27, 2017
బెంగళూరు : పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి పీజీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి 8 బంగారుపతకాలు సాధించింది బెంగళూరుకు చెందిన సౌజన్య అనే పేదింటి యువతి. బెంగళూరు యూనివర్శిటీ 52వ స్నాతకోత్సవంలో సౌజన్యకు 8 బంగారుపతకాలు, నగదు బహుమతిని శుక్రవారం ప్రదానం చేశారు. ఏడేళ్ల క్రితం సౌజన్య పదో తరగతి పరీక్షలు రాసిన రోజే తండ్రి మరణించాడు. దీంతో తల్లి పనిమనిషిగా పనిచేస్తూ కూతురిని చదివించింది. తన తల్లి కష్టపడి పనిచేసి తనను పీజీ చదివించిందని సౌజన్య చెప్పింది. భవిష్యత్ లో తాను పీహెచ్ డీ చేసి, ఐఏఎస్ అధికారి అయ్యేందుకు సంసిద్ధమవుతున్నానని సౌజన్య వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







