8 బంగారు పతకాలు బెంగళూరు వర్శిటీలో పనిమనిషి కూతురికి...

- January 27, 2017 , by Maagulf
8 బంగారు పతకాలు బెంగళూరు వర్శిటీలో పనిమనిషి కూతురికి...

బెంగళూరు : పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి పీజీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి 8 బంగారుపతకాలు సాధించింది బెంగళూరుకు చెందిన సౌజన్య అనే పేదింటి యువతి. బెంగళూరు యూనివర్శిటీ 52వ స్నాతకోత్సవంలో సౌజన్యకు 8 బంగారుపతకాలు, నగదు బహుమతిని శుక్రవారం ప్రదానం చేశారు. ఏడేళ్ల క్రితం సౌజన్య పదో తరగతి పరీక్షలు రాసిన రోజే తండ్రి మరణించాడు. దీంతో తల్లి పనిమనిషిగా పనిచేస్తూ కూతురిని చదివించింది. తన తల్లి కష్టపడి పనిచేసి తనను పీజీ చదివించిందని సౌజన్య చెప్పింది. భవిష్యత్ లో తాను పీహెచ్ డీ చేసి, ఐఏఎస్ అధికారి అయ్యేందుకు సంసిద్ధమవుతున్నానని సౌజన్య వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com