కార్పోరేటర్లు, సినీతారల మధ్య క్రికెట్‌ ట్రోఫీ...

- January 27, 2017 , by Maagulf
కార్పోరేటర్లు, సినీతారల మధ్య క్రికెట్‌ ట్రోఫీ...

హైదరాబాద్‌: కార్పోరేటర్లు ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్‌ పోటీలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించిది. ఫిబ్రవరి 5న జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్లు, సినీతారల మధ్య ఫిబ్రవరి 5న క్రికెట్‌ పోటీలు నిర్వహించనుంది. పురుషులు, మహిళా జట్ల మధ్య వేర్వేరుగా క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ పురుషుల జట్టుకు రాంనగర్‌ కార్పోరేటర్‌ శ్రీనివాసరెడ్డి, సినీనటుల జట్టుకు శ్రీకాంత్‌ సారధ్యం వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ మహిళల జట్టుకు బంజారాహిల్స్‌ కార్పోరేటర్‌ విజయలక్ష్మి, సినీతారల జట్టుకు సంజన సారథ్యం వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించి లోగో, పోస్టర్స్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అధికారులు ఈరోజు ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com