పుంజుకున్న పసిడి ధర

- January 28, 2017 , by Maagulf
పుంజుకున్న పసిడి ధర

 

బంగారం ధర తిరిగి పుంజుకుంది. శుక్రవారం ఒక్కరోజే పసిడి ధర రూ.400 తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాటి ట్రేడింగ్‌లో రూ.230 పెరిగి రూ.29,380కు చేరింది. వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో బంగారం ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో వెండి ధర పెరిగింది.
అంతర్జాతీయంగా బంగార ధర 0.25శాతం పెరగడంతో ఔన్సు 1,191.30 డాలర్లకు చేరింది. వెండి 2.27శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లు పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com