వకూద్: కొత్తగా 10 ఫ్యూల్ స్టేషన్స్
- January 28, 2017
కొత్తగా ఏర్పాటైన రెండు కొత్త ఫ్యూల్ స్టేషన్స్ (అల్ మషాఫ్ మరియు అబు నఖ్లా) త్వరలో అందుబాటులోకి వస్తాయని ఖతార్ ఫ్యూయల్ (వకూద్) పేర్కొంది. వకూద్ కొత్తగా దేశవ్యాప్తంగా మరో 10 ఫ్యూల్ స్టేషన్స్ని ఈ ఏడాది ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 43 పెట్రోల్ స్టేషన్స్ అలాగే 5 మొబైల్ ఫ్యూల్ స్టేషన్స్ని నిర్వహిస్తోంది. కొత్త స్టేషన్స్ వాహనదారులకు అనుగుణంగా, స్ట్రాటజిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది వకూద్ సంస్థ. వాహన తయారీదారులు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్స్ని ఏవైపు ఏర్పాటు చేసినాసరే, వాటికి అందుబాటులో ఉండేలా పెద్ద పెద్ద పైప్స్తో పెట్రోల్ స్టేషన్స్ని తీర్చిదిద్దుతున్నట్లు వకూద్ అధికారులు చెప్పారు. ఈ చర్యల వల్ల వాహనదారులు త్వరగా తమ వాహనాల్ని ఫ్యూయలింగ్ చేసుకోగలుగుతారని వారు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







