రెండు కొత్త ఫీచర్లు వాట్సాప్ బీటాలో...
- January 28, 2017
వాషింగ్టన్ : వాట్సాప్ బీటా (ప్రయోగాత్మక సేవలు)లోని కొన్ని వెర్షన్లలో మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రూప్ చాట్లలో లైవ్ లొకేషన్ ఫీచర్ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీంతో గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఎక్కుడున్నారో మిగిలిన వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. సభ్యులంతా ఒకచోట కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరెంత దూరంలో ఉన్నారో తెలుసుకోడానికి ఇది బాగా ఉపయోగపడనుంది.
ఇందుకోసం వినియోగదారులు గ్రూప్లోకి వెళ్లి 'షో మై ఫ్రెండ్స్'అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో ఫీచర్ విషయానికి వస్తే వినియోగదారులు ఒకసారి పంపిన సందేశాలను కూడా మళ్లీ వెనక్కు తీసుకుని మార్పులు చేసి పంపొచ్చు.
అయితే సందేశాన్ని పొందిన వ్యక్తి అప్పటికి దానిని చదివి ఉండక పోతేనే ఇది సాధ్యమవుతుంది. వాట్సాప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు తెలియజేసే @WABetaInfo అనే సంస్థ ఈ వివరాలను అందించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







