సిరివెన్నెల వేటూరి సాహితీ పీఠం పురస్కారం...
- January 29, 2017
తుని,జనవరి 29: రాసిన ప్రతి పాట ప్రజల హృదయాన్ని తాకాలనేదే తన ఆరాటమని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వేటూరి సాహితీ పీఠం సప్తమ పురస్కారాన్ని ఆదివారం సిరివెన్నెలకు అందించారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ విద్యాసంస్థల కల్చరల్ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిరివెన్నెల మాట్లాడుతూ వ్యక్తి భావాలను అనుసరించి అతనిని ఆరాధించాలన్నారు. వేటూరి వయసు తన తండ్రి వయసు ఒక్కటేనని, తల్లిదండ్రుల తర్వాత వేటూరినే నాన్నా అని పిలిచేవాడినన్నారు. కాకినాడలో సినిమాలు చూసేటప్పుడు వేటూరి పాటలను విని సాహిత్యంపై మక్కువ పెంచుకున్నానన్నారు.
తనకు సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశ్యమే లేదని ఆంధ్రా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరడమే తన లక్ష్యంగా ఉండేదన్నారు. ప్రవృత్తిని వృత్తిగా చేసుకున్నానని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









