సిరివెన్నెల వేటూరి సాహితీ పీఠం పురస్కారం...
- January 29, 2017
తుని,జనవరి 29: రాసిన ప్రతి పాట ప్రజల హృదయాన్ని తాకాలనేదే తన ఆరాటమని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వేటూరి సాహితీ పీఠం సప్తమ పురస్కారాన్ని ఆదివారం సిరివెన్నెలకు అందించారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ విద్యాసంస్థల కల్చరల్ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిరివెన్నెల మాట్లాడుతూ వ్యక్తి భావాలను అనుసరించి అతనిని ఆరాధించాలన్నారు. వేటూరి వయసు తన తండ్రి వయసు ఒక్కటేనని, తల్లిదండ్రుల తర్వాత వేటూరినే నాన్నా అని పిలిచేవాడినన్నారు. కాకినాడలో సినిమాలు చూసేటప్పుడు వేటూరి పాటలను విని సాహిత్యంపై మక్కువ పెంచుకున్నానన్నారు.
తనకు సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశ్యమే లేదని ఆంధ్రా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరడమే తన లక్ష్యంగా ఉండేదన్నారు. ప్రవృత్తిని వృత్తిగా చేసుకున్నానని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







