సలామ్ఎయిర్ ఫ్లైట్స్: సోమవారం నుంచి
- January 30, 2017
మస్కట్: ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, తన తొలి ఎ320 ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్ (సంహారం) సోమవారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించింది. సయ్యిద్ తైమూర్ బిన్ అసద్ అల్ సైద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సలామ్ ఎయిర్ ఛైర్మన్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ యహ్మాది మాట్లాడుతూ, షేర్ హోల్డర్స్ నుంచి లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సమర్థవంతంగా తమ సేవలు ఈ రంగంలో అందిస్తామని ఆయన చెప్పారు. తమ స్టాఫ్లో 68 శాతం ఒమనీయులు ఉన్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపారాయన. సలామ్ ఎయిర్ సిఇఓ ఫ్రాంకోయిస్ బౌటెల్లర్ మాట్లాడుతూ, సలామ్ ఎయిర్ టీమ్కి, అలాగే భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణీకులకు తమ ప్రయాణం అత్యద్భుతంగా ఉండేలా చేయడంతోపాటు, వారికి వీలుగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తామన్నారు. సలాలా మరియు మస్కట్ మధ్య ప్రారంభమవుతున్న సలామ్ ఎయిర్ సేవలు, ముందు ముందు దుబాయ్, జెడ్డా, మదినా, కరాచి, సియోల్ కోట్, ముల్తాన్లకు విస్తరించనున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







