నేటితో యూ.ఏ.ఈ. లో మధ్యాహ్న విరామ నిబంధన సరి
- September 15, 2015
యూ. ఏ. ఈ. లో కార్మిక మంత్రి శ్రీ సక్ర్ ఘోబష్ ఆదేశాల మేరకు కాల్చివేసే ఎండల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికై జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12 30 నుండి 3 00 గంటల మధ్య పనిచేయడాన్ని నిషేధిస్తూ, అధిక పనిగంటలలో పనిచేయించడం శిక్షా ర్హo అని విధించిన ‘మధ్యాహ్న విరామ నిబంధన’ నిబంధన నేటితో సరి అని కార్మిక శాఖ తెలిపింది. గత 11 సంవత్సరాల నుండి1980 వ సంవత్సరపు ఫెడరల్ లా నెంబరు 8 ప్రకారం ఈ నిబంధన ఆమలౌ తూ వస్తోంది.ఐతే, ఆఖరి నిముషం వరకు పర్యవేక్షణ బృందాలు, అన్ని కంపెనీలు ఈ నిబంధన పాటిస్తున్నాయా లేదా అని నిరంతరం పహారా కాస్తునే ఉన్నాయి. పై నిబంధన పాటించినందుకు, కార్మికులకు ఉచిత ఆరోగ్య తనిఖీలు, ఆత్మ రక్షణ విధానలలో శిక్షణ ఇవ్వడం వంటి సంరక్షణ చర్యలు చేపట్టినందుకు అన్ని ప్రభుత్వ మరీయు ప్రైవేటు కంపెనీల వారికి, మరియు కార్మికులకు చల్లని నీరు మరియు పళ్ళ రసాలు ఇచ్చి దయతో సహకరించిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









