నేటితో యూ.ఏ.ఈ. లో మధ్యాహ్న విరామ నిబంధన సరి

- September 15, 2015 , by Maagulf
నేటితో  యూ.ఏ.ఈ. లో మధ్యాహ్న విరామ నిబంధన సరి

యూ. ఏ. ఈ. లో కార్మిక మంత్రి శ్రీ సక్ర్  ఘోబష్ ఆదేశాల మేరకు కాల్చివేసే ఎండల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికై జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12 30 నుండి 3 00 గంటల మధ్య పనిచేయడాన్ని నిషేధిస్తూ, అధిక పనిగంటలలో పనిచేయించడం శిక్షా ర్హo అని విధించిన ‘మధ్యాహ్న విరామ నిబంధన’ నిబంధన నేటితో సరి అని కార్మిక శాఖ తెలిపింది. గత 11 సంవత్సరాల  నుండి1980 వ సంవత్సరపు ఫెడరల్ లా నెంబరు 8 ప్రకారం ఈ నిబంధన ఆమలౌ తూ వస్తోంది.ఐతే, ఆఖరి నిముషం వరకు పర్యవేక్షణ బృందాలు, అన్ని కంపెనీలు ఈ నిబంధన పాటిస్తున్నాయా లేదా అని నిరంతరం పహారా కాస్తునే ఉన్నాయి.  పై నిబంధన పాటించినందుకు, కార్మికులకు  ఉచిత ఆరోగ్య తనిఖీలు, ఆత్మ రక్షణ విధానలలో శిక్షణ ఇవ్వడం వంటి సంరక్షణ చర్యలు చేపట్టినందుకు అన్ని ప్రభుత్వ మరీయు ప్రైవేటు కంపెనీల వారికి, మరియు కార్మికులకు చల్లని నీరు మరియు పళ్ళ రసాలు ఇచ్చి దయతో సహకరించిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com