జనవరి 26 ఘటనలపై విచారణ ప్రారంభం
- February 02, 2017
మనామా: టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీప్ ప్రాసిక్యూటర్ ఇసా అల్ రువైయి మాట్లాడుతూ, జనవరి 26న జరిగిన ఘటనలపై విచారణ ప్రారంభమయ్యిందన్నారు. ఈ ఘటనలో టెర్రిస్టు గ్రూపుకు చెందిన కొందరు దుండగులు, సెక్యూరిటీ సిబ్బందిని అలాగే వాహనాల్ని టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. బహ్రెయిన్లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ ఘటనలో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసింది. నిందితులు నేరానికి పాల్పడిన వైనం గురించి, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వివరాలు అందించింది. అరెస్టయిన నిందితులు తాము ఓ తీవ్రవాద సంస్థలో చేరి, శిక్షణ పొందామని, దాడులకు దిగామని విచారణలో ఒప్పుకున్నట్లు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. తనిఖీల్లో భాగంగా ఎన్ఎస్ఎ, నిందితుల నుంచి పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకుంది. నిందితులంతా కలిసి కొత్తగా ఓ తీవ్రవాద గ్రూపుని ఏర్పాటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









