పరగడుపున టీ, కాఫీలు తాగకూడదు.. అరటిపండ్లు, కూల్డ్రింక్స్ కూడా?...
- February 02, 2017
ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అతిగా తింటే మాత్రం విషం. ఉదయం పూట పరగడుపున టీ, కాఫీలు తాగడం మంచిది కాదు. ఇలా తాగితే హార్మోన్లు అన్ బ్యాలెన్స్ అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీ, టీలు తప్పక తాగాల్సి వస్తే.. ముందుగా ఒక గ్లాస్ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీ లు తాగటం మంచిది. అలాగే కూల్డ్రింక్స్ తాగకూడదు. తాగితే వాటిలోని ఆమ్లాల కారణంగా వికారం, వాంతులు వంటి రుగ్మతలతో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కవ కాలం కొనసాగితే అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అల్పాహారం సులభంగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. చాలా మంది పరగడుపున టమోటా రైస్, టమోటా బాత్ లాంటివి తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది.
కాబట్టి ఏదైనా వేరే పదార్థం తిన్న తరువాత పుల్లటి పదార్థాలు తినడం మంచిది. ఇక అరటిపండ్లు పరగడుపున అస్సలు తినకూడదు. అందులో ఉన్న మెగ్నీషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందటం మంచిదికాదంటున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







