కువైట్, ఖత్తర్, దుబాయి, అబుదాబిలకు తిరుపతి నుంచి ఏప్రిల్ నుండి విమాన సర్వీసులు..!
- February 03, 2017
తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరే కాని, ఇప్పటి వరకు ఒక్క ఇంటర్నేషనల్ సర్వీస్ కూడా ఇక్కడ నుంచి లేదు. అయితే, త్వరలోనే ఈ కల తీరనుంది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి, విదేశీ సర్వీసులు నడవనున్నాయి. మొదటగా ఏప్రిల్ నెల నుంచి, గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి గల్ఫ్ దేశాలైన కువైట్, ఖత్తర్, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. ప్రస్తుతం, తిరుపతి విమానాశ్రయానికి 7 విమానాలు నడుస్తున్నాయి.
గల్ఫ్ దేశాలకు నడపటానికి కారణం, కడప, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు, ఉపాధి కోసం వేలాదిగా వెళ్తూ ఉంటారు. వీళ్ళు చెన్నై ఎయిర్పోర్టు ను ఆశ్రయిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్యం దృష్ట్యా ప్రవాస భారతీయుల కోసం గల్ఫ్ దేశాలకు నుంచి సర్వీసులు నడపడానికి నిర్ణయించారు. అలాగే, తిరుమల శ్రీ వారి దర్శనం కోసం, వచ్చే భక్తులకి కూడా, ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అలాగే, త్వరలోనే, మరిన్ని దేశాలకు, విమానాలు నడుపుతామని, పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతి రోజు గల్ఫ్ దేశాలకు చెన్నై నుండి సుమారు రోజుకు 1000 మంది వరకు రక పోకలు సాగిస్తున్నారు. ఒక వేల ఈ సర్వీసులు మొదలైతే ఇక్కడి తెలుగు వారికీ చాల సంతోషకరమైన వార్తే అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి రేణిగుంట కు నేరుగా సర్విసుల కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా విన్నపాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారి కళ తీరిన్ట్లవుతుంది. అలాగే ఎంతో సమయము, మరియు డబ్బులు కుడా అదా అవుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







