తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ...

- February 03, 2017 , by Maagulf
తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ...

హైదరాబాద్: చలికాలం ముగుస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి మాత్రం తెలంగాణా రాష్ట్రాన్ని వీడటం లేదు. తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు తాజాగా వెలుగుచూడటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇందులో 13మందికి హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యుల పరీక్షల్లో తేలింది. 85 మంది రోగులను పరీక్షించగా వారిలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలిందని వైద్యులు పేర్కొన్నారు.గత సంవత్సరం 3,696 మంది శాంపిల్స్ ను పరీక్షించగా వారిలో 250 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని వెల్లడైంది. ఈ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com