100 మంది మృతి హిమపాతానికి...

- February 05, 2017 , by Maagulf
100 మంది మృతి హిమపాతానికి...

కాబుల్‌/పెషావర్‌/చండీగఢ్‌, ఫిబ్రవరి 5: ఉత్తర భారతం సహా ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలను భారీ హిమపాతం అతలాకుతలం చేస్తోంది. మంచు చరియలు విరుచుకు పడటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆఫ్ఘన్‌లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా మంచు చరియలు విరిగి పడి వందమందికిపైగా చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విరిగిపడిన మంచు చరియలతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మధ్య, ఈశాన్య ప్రావిన్స్‌లలో రహదారులు మూసుకుపోయాయి. ఉత్తర పాకిస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లోనూ దట్టమైన మంచుకింద ఇళ్లు కూరుకుపోయాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని పలుప్రాంతాల్లోనూ రాబోయే 24గంటలపాటు భారీ మంచు కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com