'షో టైమ్' పాటలు విడుదల
- February 06, 2017
రమా రీల్స్ పతాకంపై రణధీర్, రుక్సార్ నటీనటులుగా ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ''షో టైమ్''. జాన్ సుధీర్ పూదోట నిర్మాత. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఇటీవల హైదరాబాద్లో పాటల్ని విడుదల చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రచార చిత్రాల్ని ఆవిష్కరించారు. అనుష్క తొలి సీడీని ఆవిష్కరించారు. రచయిత శివశక్తిదత్తా స్వీకరించారు. రాజమౌళి మాట్లాడుతూ ''కాంచీ ప్రతి మాటలో వెటకారం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో తప్పులు చూపిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పులుండకూడదని ఆశిస్తున్నా'' అని అన్నారు. కాంచీ మాట్లాడుతూ '' నేనెప్పుడో డైరెక్షన్ చెయ్యాలి. ఆలస్యమైన మాట నిజమే..
సినిమాని బాగా తియ్యగలననే నమ్మకంతో ముందడుగు వేశా. తప్పులు వెదక్కుండా ఉండాలని జాగ్రత్తగా సినిమా తీశా'' అని అన్నారు. ''ఐటమ్ సాంగ్, ఫైట్లు లేకుండా అందరూ ఆస్వాదించేలా సినిమా తీశాడు కాంచీ. అందరూ మాట్లాడుకునే భాషలో హాయిగొలిపే పాటలు ఇందులో ఉన్నాయి'' అని కీరవాణి చెప్పారు. చక్కని పాటలు కుదిరాయనీ, ఈ నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఓ థియేటర్లో సాగే కథ ఇదని కె.రాఘవేంద్రరావు చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







