పెరిగిన పసిడి, వెండి ధరలు

- February 07, 2017 , by Maagulf
పెరిగిన పసిడి, వెండి ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.29,850కి చేరింది. ఇదే బాటలో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.42,800కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.29శాతం పెరిగి 1,235.20 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి ధర 1.26శాతం పెరిగి 17.71డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com