మరో ఘనతను సొంతం చేసుకోనున్న ఇస్రో
- February 07, 2017
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనంలో మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. గత దశాబ్ద కాలంలో అనేక ప్రతిష్ఠాత్మక ప్రయోగాలతో దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్ ఇప్పుడు ఏకంగా ప్రపంచానికే సవాల్ విసరబోతోంది. మంగళ్యాన్, చంద్రయాన్-1 వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడు సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఒకేసారి ఒకే రాకెట్ ద్వారా 108 ఉపగ్రహాలను ప్రయోగించే అరుదైన సవాల్ అందుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆ సువర్ణ అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 15న ఉదయం 9.28గంటలకు పీఎస్ఎల్వీ-సి37 రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన కార్టోశాట్-2డి ఉపగ్రహం సహా 108 ఉపగ్రహాలు ప్రయోగించనుంది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







