విజయవాడ రైల్వేస్టేషన్కి మహర్దశ పట్టనుంది...
- February 07, 2017
మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటు.
నేడు దిల్లీ నుంచి ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేష్ప్రభు
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్కి మహర్దశ పట్టనుంది. విమానాశ్రయ తరహాలో త్వరలోనే ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ఆలస్యమైనా ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు మల్టీప్లెక్స్లు, షామింగ్ మాల్స్, ఐదు నక్షత్రాల తరహా హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ ప్రాంగణాలను వినోద, వాణిజ్య కేంద్రాలుగా విస్తరించేందుకు 'స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు'ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి వెబ్సైట్లో టెండర్ల ప్రక్రియను రైల్వే మంత్రి సురేష్ప్రభు బుధవారం దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయవాడ సమీపంలో రాయనపాడు, సత్యనారాయణపురం, సింగ్నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న విలువైన రైల్వే స్థలాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగించనున్నారు. . మల్టీఫంక్షనల్ కాంప్లెక్స్ ఏర్పాటు నిమిత్తం ఇప్పటికే రైల్వేస్టేషన్ ముఖద్వారం ఆవరణలోని స్థలాన్ని రైల్వే శాఖ ఎంపిక చేసింది. తారాపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.
ఇప్పుడున్న హోటళ్లతో పాటు రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు, 6,7, 9,10 స్టేషన్లలో ఆదనంగా ఏసీ డార్మెటరీలు, సినిమాలు వీక్షించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







