ఎన్టీఆర్ - బాబీ కలయికలో ఓ చిత్రం విలన్ గా నితిన్...
- February 07, 2017
ఎన్టీఆర్ - బాబీ కలయికలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం 'జై లవ కుశ' టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రం కోసం హాలీవుడ్కు టెక్నిషన్ వాన్సీ హార్ట్వెల్ పని చేయనున్నాడు. టెక్నాలజీని ఉపయోగించి మనుషులను విభిన్న రూపాల్లో కనిపించేలా చేయడం వాన్సీ ప్రత్యేకత. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, రోబో సినిమాలకి పనిచేశారీయన. ఈ చిత్రానికి సీ కే మురళీధరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు.
ఈ చిత్రంలో విలన్ గా నటించేందుకు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' కోసం ముందుగా విలన్ పాత్ర కోసం నితిన్ నే అనుకొన్నారు.
అయితే, నితిన్ నో చెప్పేశాడు. ఇప్పుడు తారక్ కి ఓకే చెప్పడం విశేషం.
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రాశీఖన్నాని ఫైనల్ చేసింది చిత్రబృందం. మరో ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 10న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ నెల 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలవ్వనుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







