ఏపి రాజధాని వేదికగా సీసీఎల్ సూపర్‌6

- February 08, 2017 , by Maagulf
ఏపి రాజధాని వేదికగా సీసీఎల్ సూపర్‌6

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సూపర్ 6 పోటిలకు అమరావతి వేదిక కానుంది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏప్రిల్ 1, 2 తేదిల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముందుకొచ్చారు. సచివాలయంలో ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును బాలివుడ్ నటుడు సోహెల్ ఖాన్, సీసీఎల్ నిర్వహకుడు విష్ణు ఇండూరిలు కలిసి మ్యాచ్ నిర్వహణపై చర్చించారు. హిందీ,తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలైనా బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ జట్లు పాల్గోనున్నాయి. కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండే ఈ కొత్త తరహా క్రికెట్ ఫార్మెట్ లో ప్రతి జట్టులో నలుగురు సీనీ నటులతో పాటు ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com