ఖతార్లో ట్రాఫిక్ సంబంధిత మరణాలు తగ్గుముఖం
- February 09, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సంబంధిత మరణాలు ఖతార్లో గణనీయంగా తగ్గినట్లు తేలింది. 2015తో పోల్చితే 2016లో ఈ తగ్గుదల 21.6 శాతంగా నమోదయ్యింది. 2015లో మొత్తం 227 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 2016లో 178గా నమోదైంది. ఇందులో 94.9 శాతం మంది పురుషులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జి మాట్లాడుతూ, ట్రాపిక్ రూల్స్ని అమలు చేయడంలో తమ శాఖ ప్రదర్శిస్తున్న శ్రద్ధ, అలాగే వాహనదారుల్లో పెరుగుతున్న అవగాహనే రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు కారణమన్నారు. 2016లో జరిగిన 97.5 శాతం ప్రమాదాల్లో మరణాలు చోటు చేసుకోలదన్నారాయన. అతి వేగం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, రాంగ్ ఓవర్టేకింగ్ ముగ్గురి మరణానికి కారణమయ్యింది. డిసిప్లిన్ లేని డ్రైవింగ్ 14 మందిని బలి తీసుకుంది. ఓవర్ టర్నింగ్ వెహికిల్స్ 12.1 శాతం మేజర్ యాక్సిడెంట్లకు కారణమయ్యాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







