ఖతార్లో ట్రాఫిక్ సంబంధిత మరణాలు తగ్గుముఖం
- February 09, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సంబంధిత మరణాలు ఖతార్లో గణనీయంగా తగ్గినట్లు తేలింది. 2015తో పోల్చితే 2016లో ఈ తగ్గుదల 21.6 శాతంగా నమోదయ్యింది. 2015లో మొత్తం 227 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 2016లో 178గా నమోదైంది. ఇందులో 94.9 శాతం మంది పురుషులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జి మాట్లాడుతూ, ట్రాపిక్ రూల్స్ని అమలు చేయడంలో తమ శాఖ ప్రదర్శిస్తున్న శ్రద్ధ, అలాగే వాహనదారుల్లో పెరుగుతున్న అవగాహనే రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు కారణమన్నారు. 2016లో జరిగిన 97.5 శాతం ప్రమాదాల్లో మరణాలు చోటు చేసుకోలదన్నారాయన. అతి వేగం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, రాంగ్ ఓవర్టేకింగ్ ముగ్గురి మరణానికి కారణమయ్యింది. డిసిప్లిన్ లేని డ్రైవింగ్ 14 మందిని బలి తీసుకుంది. ఓవర్ టర్నింగ్ వెహికిల్స్ 12.1 శాతం మేజర్ యాక్సిడెంట్లకు కారణమయ్యాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









