ఖతార్లో ట్రాఫిక్ సంబంధిత మరణాలు తగ్గుముఖం
- February 09, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సంబంధిత మరణాలు ఖతార్లో గణనీయంగా తగ్గినట్లు తేలింది. 2015తో పోల్చితే 2016లో ఈ తగ్గుదల 21.6 శాతంగా నమోదయ్యింది. 2015లో మొత్తం 227 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 2016లో 178గా నమోదైంది. ఇందులో 94.9 శాతం మంది పురుషులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జి మాట్లాడుతూ, ట్రాపిక్ రూల్స్ని అమలు చేయడంలో తమ శాఖ ప్రదర్శిస్తున్న శ్రద్ధ, అలాగే వాహనదారుల్లో పెరుగుతున్న అవగాహనే రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు కారణమన్నారు. 2016లో జరిగిన 97.5 శాతం ప్రమాదాల్లో మరణాలు చోటు చేసుకోలదన్నారాయన. అతి వేగం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, రాంగ్ ఓవర్టేకింగ్ ముగ్గురి మరణానికి కారణమయ్యింది. డిసిప్లిన్ లేని డ్రైవింగ్ 14 మందిని బలి తీసుకుంది. ఓవర్ టర్నింగ్ వెహికిల్స్ 12.1 శాతం మేజర్ యాక్సిడెంట్లకు కారణమయ్యాయి.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









