ఫిఫా అండర్-17 ప్రపంచకప్ మస్కట్!
- February 10, 2017
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న అండర్-17 ఫుట్బాల్ ఫిఫా ప్రపంచకప్ పోటీల అధికారిక మస్కట్ విడుదలైంది. న్యూదిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 'ఖేలియో'ను కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్గోయల్, స్థానిక క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్లు విడుదల చేశారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే చిరుతను ఈ క్రీడలకు మస్కట్గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి గోయల్ మాట్లాడుతూ.. 'భారత్లో జరిగిన క్రీడా కార్యక్రమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ మస్కట్ గుర్తిండిపోతుంది.
'ఖేలియో' యంగ్, వైబ్రెంట్, ఉత్సాహభరితం దేశాన్ని ప్రతిబింబించేందుకు ఇదే సరైనది. ఫుట్బాల్ క్రీడ మరింత ఉత్సాహంగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని అన్నారు.
2017 సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్లోని ఆరువేదికల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ ప్రపంచకప్లో భారత్ సహా 24 జట్టు పాల్గొంటాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









