ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ మస్కట్‌!

- February 10, 2017 , by Maagulf
ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ మస్కట్‌!

భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న అండర్‌-17 ఫుట్‌బాల్‌ ఫిఫా ప్రపంచకప్‌ పోటీల అధికారిక మస్కట్‌ విడుదలైంది. న్యూదిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 'ఖేలియో'ను కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌గోయల్‌, స్థానిక క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌లు విడుదల చేశారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే చిరుతను ఈ క్రీడలకు మస్కట్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. 'భారత్‌లో జరిగిన క్రీడా కార్యక్రమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ మస్కట్‌ గుర్తిండిపోతుంది.

 

'ఖేలియో' యంగ్‌, వైబ్రెంట్‌, ఉత్సాహభరితం దేశాన్ని ప్రతిబింబించేందుకు ఇదే సరైనది. ఫుట్‌బాల్‌ క్రీడ మరింత ఉత్సాహంగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని అన్నారు.

2017 సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్‌లోని ఆరువేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ సహా 24 జట్టు పాల్గొంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com