ఫిఫా అండర్-17 ప్రపంచకప్ మస్కట్!
- February 10, 2017
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న అండర్-17 ఫుట్బాల్ ఫిఫా ప్రపంచకప్ పోటీల అధికారిక మస్కట్ విడుదలైంది. న్యూదిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 'ఖేలియో'ను కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్గోయల్, స్థానిక క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్లు విడుదల చేశారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే చిరుతను ఈ క్రీడలకు మస్కట్గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి గోయల్ మాట్లాడుతూ.. 'భారత్లో జరిగిన క్రీడా కార్యక్రమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ మస్కట్ గుర్తిండిపోతుంది.
'ఖేలియో' యంగ్, వైబ్రెంట్, ఉత్సాహభరితం దేశాన్ని ప్రతిబింబించేందుకు ఇదే సరైనది. ఫుట్బాల్ క్రీడ మరింత ఉత్సాహంగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని అన్నారు.
2017 సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్లోని ఆరువేదికల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ ప్రపంచకప్లో భారత్ సహా 24 జట్టు పాల్గొంటాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్







