టీమిండియా అరుదైన రికార్డు..
- February 10, 2017
బంగ్లాదేశ్తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో భారత క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రెండు రోజైన శుక్రవారం టీమిండియా స్కోరు 600 పరుగులకు చేరగానే ఈ ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్ల్లో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు సాధిచింది. భారత్ ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో ఆ జట్టుపై రెండు సార్లు, ప్రస్తుతం హైదరాబాద్లో బంగ్లాపై ఒకసారి 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది. భారత్ తర్వాత.. ఆస్ట్రేలియా 1946లో ఇంగ్లండ్పై రెండు సార్లు, వెస్టిండీస్ 1948లో భారత్పై రెండు సార్లు, భారత్ 2009లో శ్రీలంకపై రెండు సార్లు ఇలా వరుస మ్యాచ్ల్లో 600+ పరుగులు చేశాయి.
టీ విరామం సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 620 పరుగులు చేసింది. సాహా 83, జడేజా 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. స్కోరు వివరాలు భారత్ మొదటి ఇన్నింగ్స్: రాహుల్ 2, విజయ్ 108, పుజారా 83, కోహ్లీ 204, రహానే 82, అశ్విన్ 34 పరుగులు చేసి అవుటయ్యారు. బంగ్లా బౌలింగ్: తైజుల్ ఇస్లాం 3, మెహదీ హసన్ 2, తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







