కార్మికులకోసం 'పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌'

- February 10, 2017 , by Maagulf
కార్మికులకోసం 'పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌'

అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెరిగేలా కేంద్రం 'పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌' చట్టం తీసుకువచ్చిందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. భారతీయ మజ్దూర్‌ సంఘ్‌తో పాటు కొన్ని కార్మిక సంఘాలు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించాయి. కార్మికుల జీతాలు పెరిగే చట్టాన్ని తీసుకొచ్చినందుకు గాను ఆయనను అభినందించాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మరింత సాయం చేస్తుందని చెప్పారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతను కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. కార్మికుడికి మొదటి వారంలోనే బ్యాంకు ద్వారా జీతం ఇవ్వాలన్నారు. 2020 నాటికి ప్రతి కార్మికుడికీ ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com