కార్మికులకోసం 'పేమెంట్ ఆఫ్ వేజెస్'
- February 10, 2017
అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెరిగేలా కేంద్రం 'పేమెంట్ ఆఫ్ వేజెస్' చట్టం తీసుకువచ్చిందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్తో పాటు కొన్ని కార్మిక సంఘాలు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించాయి. కార్మికుల జీతాలు పెరిగే చట్టాన్ని తీసుకొచ్చినందుకు గాను ఆయనను అభినందించాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మరింత సాయం చేస్తుందని చెప్పారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతను కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. కార్మికుడికి మొదటి వారంలోనే బ్యాంకు ద్వారా జీతం ఇవ్వాలన్నారు. 2020 నాటికి ప్రతి కార్మికుడికీ ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









