మరింత కట్టుదిట్టంగా వాట్సాప్.!
- February 10, 2017
ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ తన వినియోగదారుల ఖాతాలకు మరింత భద్రత కల్పించేందుకు కొత్త భద్రతా విధానాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ వినియోగదారులందరికీ రెండంచెల వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతకుముందు చాలా కాలం పాటు దీన్ని బీటా వెర్షన్లో పరీక్షించిన ఆ సంస్థ ఎట్టకేలకు కొత్త ఆప్షన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఆప్షన్తో ఖాతాను మరింత పదిల పరుచుకోవచ్చు. తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ ఆప్షనల్ మాత్రమే. ఈ ఫీచర్ను ఉపయోగించుకోవాలని అనుకునేవారు వాట్సాప్ సెట్టింగ్స్లోని అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళితే 'టు-స్టెప్ వెరిఫికేషన్' ఆప్షన్ కనిపిస్తుంది.
అందులో ఆరు అంకెల పాస్వర్డ్ను పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ-మెయిల్ ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఈ-మెయిల్ పనికొస్తుంది. అయితే, ఈ-మెయిల్ ఐడీని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుందని, ఒకవేళ తప్పుడు ఐడీ ఇస్తే ఆ లింక్ వేరే వాళ్లకు వెళ్లే ప్రమాదముందని కంపెనీ పేర్కొంది. కాగా, తాజాగా తీసుకొచ్చిన ఫీచర్తో మీ అకౌంట్ను వేరేవాళ్లు వెరిఫై చేసే వీలుండదు. ఒక వేళ కొత్తగా ఫోన్ మార్చాలనుకునేటప్పుడు ఈ ఆరంకెల పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







