విక్రం సరసన తొలిసారిగా తమన్నా...
- February 10, 2017
చెన్నై: మూవింగ్ ఫ్రేమ్ బ్యానరుపై భారీ బడ్జెట్తో విక్రం హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా పేరు పెట్టలేదు. ఇది విక్రం నటిస్తున్న 53వ సినిమా. విజయ్చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రం సరసన తొలిసారిగా తమన్నా ఆడిపాడనుంది. సూరి, రాధారవి, రవికిషన్, ఆర్కే సురేష్లు ఇతర తారాగణం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. స్వరాలను తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం మొదలైంది. మీనంబాక్కంలోని బిన్ని మిల్లో తొలి సన్నివేశంతో శ్రీకారం చుట్టారు. దర్శకుడు మాట్లాడుతూ.... '' వైవిధ్య నటుడిగా విక్రం ఇప్పటికే గుర్తింపు పొందారు.
ఆయన శైలిలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని నిర్ణయించామ''ని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









