ఈజిప్టుకు చెందిన ప్రపంచంలోనే బరువైన మహిళ ముంబయిలో...
- February 10, 2017
ముంబయి: ఈజిప్టుకు చెందిన ప్రపంచంలోనే బరువైన మహిళ, 500కిలోల ఎమన్ అహ్మద్ శనివారం ఉదయం చికిత్స నిమిత్తం ముంబయిలోని సైఫీ ఆస్పత్రికి రానున్నారు. 25 సంవత్సరాలుగా అధిక బరువు కారణంగా కైరోలోని తన ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయిన ఆమె ఎట్టకేలకు చికిత్స నిమిత్తం ప్రయాణమవుతున్నారు. ఎమన్ ప్రయాణం కోసం ఈజిప్టు ఎయిర్కి చెందిన ఎయిర్బస్ 300-600కార్గో విమానంలో స్వల్ప మార్పులు చేశారు. అలెగ్జాండ్రియాలోని బోర్గ్ ఎల్ అరబ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం శుక్రవారం రాత్రి బయల్దేరి శనివారం తెల్లవారుజామున ముంబయి చేరుకుంటుంది. దాదాపు ఆరుగంటలు పట్టే ఈ ప్రయాణంలో ఎమన్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎమన్ అహ్మద్ చికిత్స నిమిత్తం సైఫీ ఆస్పత్రి ప్రధాన భవనం పక్కనే నిర్మించిన భవనాన్ని సరైన అనుమతులు లేవని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేసింది. దీంతో ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో మరో భవనాన్ని నిర్మిస్తున్నారు. చికిత్స నిమిత్తం ఎమన్ ఇక్కడ కొన్ని నెలల పాటు ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. సైఫీ ఆస్పత్రి కన్సల్టెంట్ బేరియాట్రిక్ సర్జన్ డా.ముఫ్ఫజల్ లక్డావాలా నేతృత్వంలోని వైద్య బృందం ఎమన్కు చికిత్స చేయనున్నారు.
చికిత్స అనంతరం కొంతకాలం పాటు ఎమన్ సంరక్షణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







