'కంట్రీ క్లబ్‌' అధినేతకు అరుదైన గౌరవం

- February 12, 2017 , by Maagulf

కంట్రీ క్లబ్‌ అధినేత రాజీవ్‌ రెడ్డిగారికి అరుదైన గౌరవం దక్కింది. ఆసియా గ్రేటెస్ట్‌ లీడర్స్‌ అవార్డుల కార్యక్రమంలో రాజీవ్‌ రెడ్డిగారికి 'ప్రైడ్‌ ఆప్‌ ఆసియా' పురస్కారం 2016 సంవత్సరానికిగాను దక్కింది. కంట్రీ క్లబ్‌ని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పర్యాటక రంగానికి సరికొత్త సొబగులద్దడంలో తనవంతు పాత్ర పోసిస్తున్నారు రాజీవ్‌ రెడ్డి. ప్రధానంగా ఇండియా, గల్ఫ్‌ దేశాల్లో కంట్రీ క్లబ్‌ అందరి మన్ననలూ అందుకుంటోంది. సరికొత్త ప్యాకేజీలతో పెద్ద సంఖ్యలో సభ్యుల్ని కంట్రీ క్లబ్‌ ఆకర్షిస్తోంది. వ్యాపారత్మక ధోరణిలోనే కాకుండా, అందరికీ అందుబాటులో పర్యాటకానుభూతుల్ని అందించగలుగుతోంది కంట్రీ క్లబ్‌. ఈ స్థాయిలో కంట్రీ క్లబ్‌ విస్తరించడానికి రాజీవ్‌ రెడ్డి చేసిన కృషి అనన్య సామాన్యం. ఇప్పటికే ఈ రంగంలో పలు అవార్డుల్ని అందుకున్న రాజీవ్‌ రెడ్డి, తాజాగా ప్రైడ్‌ ఆఫ్‌ ఏసియా అవార్డు అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com