తమిళనాడు సీఎం గా పళనిస్వామి..
- February 16, 2017
10 రోజులుగా తమిళనాట ఏర్పడిన రాజకీయాలకు తెరపడింది. తమిళనాడు సీఎం ఎవరు అవుతారా అని ఎంతో ఆతృతగాఎదురుచూసిన తమిళ నాడు ప్రజలకు ఎట్టకేలకు పళనిస్వామి ని సీఎం గా గవర్నర్ విద్యాసాగర్ నియమించారు. బలనిరూపణ కోసం 15 రోజులు గడవు ఇచ్చినట్లు తెలుస్తుంది. కొద్దీ సేపటి క్రితం విద్యాసాగర్ తో పళనిస్వామి భేటీ అయ్యారు. భేటీ అనంతరం పళనిస్వామి ని ప్రభుత్వం ఏర్పటుకు గవర్నర్ ఆహ్వానం ఇచ్చారు. ఈరోజు సాయింత్రం 4 : 30 నిమిషాలకు పళనిస్వామి ని సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
రెండు రోజుల క్రితం వరకు తమిళ పీఠం కోసం చినమ్మ , పన్నీరు నువ్వా నేనా అనేంతలా కొట్టుకున్నారు.
కానీ అక్రమ ఆస్తుల కేసులో సుప్రీం కోర్ట్ శశికళ ను దోషిగా తేల్చడం తో ఇక పన్నీరు నే తమిళ సీఎం అవుతాడని ఆయన వర్గాలు సంబరాలు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ బరిలోకి అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి ఎంట్రీ ఇచ్చాడు.
తనకు ప్రభుత్వాన్ని ఏర్పటు చేసే ఎమ్మెల్యేల సంఖ్యా మద్దతు ఉందని గవర్నర్ విద్యాసాగర్ కు చెప్పడం తో , గవర్నర్ సైతం పళనిస్వామి వైపే ముగ్గు చూపించడం జరిగిపోయింది. మొత్తానికి తమిళ రాజకీయాలకు తెర పడడం తో అందరూ శాంతించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







