జులైలో హోవర్ ట్యాక్సీని ప్రారంభించనున్న దుబాయ్...
- February 16, 2017
దుబాయ్: చైనీస్ ప్రోటోటైప్ సెల్ఫ్ డ్రైవింగ్ హోవర్ ట్యాక్సీని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. జులై నాటికి ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ హోవర్ ట్యాక్సీ దూసుకుపోతుంది. ప్రయాణీకుడు తాను చేరాలనుకుంటున్న గమ్యాన్ని ఎంపిక చేసుకుని, హోవర్ ట్యాక్సీని టేకాఫ్ చేయవచ్చు. ఆ తర్వాత అది నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించబడ్తుంది. 2 గంటలపాటు ఛార్జింగ్ చేస్తే, 30 నిమిషాలపాటు ప్రయాణిస్తుంది. ఇహాంగ్ సంస్థ ఈ చైనీస్ డ్రోన్ని తయారు చేసింది. 2030 నాటికి ఈ తరహా వాహనాల వినియోగం ఎక్కువగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ చైనీస్ డ్రోన్తో చెక్ పెట్టవచ్చు. ఎనిమిది ప్రొపెల్లర్స్తో ఈ క్వాడ్ కాప్టర్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







