బహ్రేయినీ ఆసుపత్రిలో మరణిస్తున్న పసిపిల్లలు
- February 16, 2017
మనామా: బహ్రేయినీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో పసిపిల్లవాడు మరణించాడు. ఈ ఏడాదిలో ఇది ఐదవ మరణ కేసు కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిన్నారుల మృతికి గల కారణాలు తెలుసుకొనేందుకు ఒక తక్షణ విచారణ జరిపేలా అధికారులకు సూచనలిస్తూ ప్రభుత్వం ఆదేశించింది.. రెద కమర్ అనే ఏడాది వయస్సు గల బాలుడు మంగళవారం సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లోని ప్రమాద మరియు అత్యవసర విభాగం చికిత్స తీసుకుంటూ మరణించినట్లు నివేదికలో వెల్లడైంది. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడంతో ఆ బాలుడు ఆసుపత్రి చిన్నారుల వార్డ్ లో చేరినట్లు తెలుస్తుంది, నివేదికల ప్రకారం, అతని ఆరోగ్య పరిస్థితి కొన్ని రోజుల తరువాత క్షీణించింది. దాంతో ఆ చిన్నారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చేర్చారు. ఆ తరువాత ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ పిల్లల మరణం పట్ల ఒక తక్షణ విచారణ జరపాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి ఫారుఖ్త్ అల్ సాలెహ్ ఆదేశించారు. ఈ దురదృష్టకర సంఘటన యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకొనేందుకు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో సమగ్ర పరిశీలనకు ఒక బృందాన్ని పంపినట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







