అమెజాన్ కొత్తప్రయోగం..!!
- February 16, 2017
సరకులను హోం డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సరికొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే డ్రోన్లతో డెలివరీ సేవలను ప్రారంభించిన ఆసంస్థ.. ఇక పై గగనతలం నుంచి కస్టమర్ల ఇంటి గుమ్మం ముందు పార్శిళ్లను దించేందుకు పారాచూట్ లను వినియోగించనుందట.
ప్రస్తుతం అమెజాన్ ప్రారంభించిన డ్రోన్ డెలివరీ విధానంలో వినియోగదారుడి ఇంటి వద్ద డ్రోన్ లాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే డ్రోన్లు గగనతలంలో ప్రయాణించడం కంటే లాండింగ్.. టేకాఫ్ లకే ఎక్కువ ఇంధనం ఖర్చవుతందట. దాంతో పాటు కొన్ని భద్రతా పరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. అందుకే డ్రోన్లతో రవాణా చేసి గగనతలం నుంచే సరుకులను భద్రంగా కిందికి దించేందుకు పారాచూట్ లను వినియోగించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
అయితే.. కిందికి వదిలాక గాలి ప్రవాహంతో పారాచూట్ లు అటుఇటు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆసమస్యకూ పరిష్కారం కనుగొన్నట్లు అమెజాన్ తెలిపింది. పారాచూట్ కిందికి దిగేంత వరకు డ్రోన్ అక్కడే గాలిలో ఉండి గమనిస్తుందట. ఒకవేళ పారాచూట్ పక్కకు కదిలితే ప్రత్యేకంగా సగ్నళ్లతో దాన్ని సరైన చోటే దిగేలా చేస్తుదట. అందుకు పారాచూట్లలోనూ ప్రత్యేకమైన వ్యవస్థ రూపొందించారాట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







