మాల్యాను వెనక్కి తీసుకురానున్న భారత ప్రభుత్వం
- February 17, 2017
బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. భారతదేశం- యునైటెడ్ కింగ్డమ్ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ)ని వినియోగించి మాల్యాను వెనుకకు పిలిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద నమోదైన కేసుల విచారణకు ఈ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మాల్యా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్లు ఎగ్గొట్టిన కేసులో తమ అభ్యర్థనను కోర్టు గత వారం మన్నించిందని ఈడీ అధికారులు తెలిపారు. యునైటెడ్ కింగ్డమ్ హోం మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆదేశాలను అమలు చేసేందుకు మన దేశ హోం మంత్రిత్వ శాఖకు ఇప్పుడు అవకాశం కలిగిందన్నారు. దీనికి సంబంధించి కోర్టు జారీ చేసిన రిక్వెస్ట్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







