మాల్యాను వెనక్కి తీసుకురానున్న భారత ప్రభుత్వం

- February 17, 2017 , by Maagulf
మాల్యాను వెనక్కి తీసుకురానున్న భారత ప్రభుత్వం

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్‌ మాల్యాను భారతదేశానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ)ని వినియోగించి మాల్యాను వెనుకకు పిలిపించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద నమోదైన కేసుల విచారణకు ఈ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మాల్యా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్లు ఎగ్గొట్టిన కేసులో తమ అభ్యర్థనను కోర్టు గత వారం మన్నించిందని ఈడీ అధికారులు తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్‌ హోం మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆదేశాలను అమలు చేసేందుకు మన దేశ హోం మంత్రిత్వ శాఖకు ఇప్పుడు అవకాశం కలిగిందన్నారు. దీనికి సంబంధించి కోర్టు జారీ చేసిన రిక్వెస్ట్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com