గుండెపోటుతో దుబాయ్ రాజకుమారుని మృతి

- September 19, 2015 , by Maagulf
గుండెపోటుతో దుబాయ్  రాజకుమారుని మృతి

దుబాయ్  పరిపాలకుడు, యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి కుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గుండెపోటుతో నేటి ఉదయం మరణించారు. జబీల్ మసీదులో అంతిమ ప్రార్ధనల అనంతరం వారి అంత్యక్రియలు బుర్ దుబాయ్ లోని  ఉమ్మ్ హురైర్ శ్మశాన వాటికలో జరుగుతాయి.

దుబాయ్  పరిపాలకుని సభ ఐన అల్ దెవాన్, దుబాయ్ లో నేటినుండి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎమిరేట్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పతాకాలు అవనతమై, సగం ఎత్తులో ఉంటాయి.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com