'గణేష్ నిమజ్జనానికి రూ.4.7 కోట్లు' కేటాయింపు
- September 19, 2015
వినాయక చవితి నిమజ్జనానికి నీటిపారుదల శాఖ విభాగం తరఫున రూ.4 కోట్ల 70 లక్షలు ఖర్చు పెడతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి నిమజ్జనాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో 33 క్రేనులు, చెరువుల వద్ద 21 క్రేనులు, నెక్లెస్ రోడ్డులో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ పనులు ఈ ఏడాది పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. గణేశుడి దయతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ నిండాయని తెలిపారు. మరిన్ని వర్షాలు పడి మరిన్ని చెరువులు నిండాలని గణేశుడని కోరుకుంటున్నాని చెప్పారు. గణేశుడి నిమజ్జనానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









