'గణేష్ నిమజ్జనానికి రూ.4.7 కోట్లు' కేటాయింపు
- September 19, 2015
వినాయక చవితి నిమజ్జనానికి నీటిపారుదల శాఖ విభాగం తరఫున రూ.4 కోట్ల 70 లక్షలు ఖర్చు పెడతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి నిమజ్జనాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో 33 క్రేనులు, చెరువుల వద్ద 21 క్రేనులు, నెక్లెస్ రోడ్డులో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ పనులు ఈ ఏడాది పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. గణేశుడి దయతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ నిండాయని తెలిపారు. మరిన్ని వర్షాలు పడి మరిన్ని చెరువులు నిండాలని గణేశుడని కోరుకుంటున్నాని చెప్పారు. గణేశుడి నిమజ్జనానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







