గుండెపోటుతో దుబాయ్ రాజకుమారుని మృతి
- September 19, 2015
దుబాయ్ పరిపాలకుడు, యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి కుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గుండెపోటుతో నేటి ఉదయం మరణించారు. జబీల్ మసీదులో అంతిమ ప్రార్ధనల అనంతరం వారి అంత్యక్రియలు బుర్ దుబాయ్ లోని ఉమ్మ్ హురైర్ శ్మశాన వాటికలో జరుగుతాయి.
దుబాయ్ పరిపాలకుని సభ ఐన అల్ దెవాన్, దుబాయ్ లో నేటినుండి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎమిరేట్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పతాకాలు అవనతమై, సగం ఎత్తులో ఉంటాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







