గందరగోళం తమిళనాడు అసెంబ్లీలో..
- February 17, 2017
చెన్నై: ఎన్నో మలుపులు .. నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మాట్లాడే అవకాశం కల్పించాలని డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్య ఓటింగ్ నిర్వహించేందుకు కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో పన్నీర్సెల్వం వర్గం చీఫ్విప్గా సెమ్మలైన్ను మధుసూదన్ నియమించారు. బలపరీక్ష మరో రోజు నిర్వహించాలి
అసెంబ్లీలో డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ...
‘‘విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. తొందర ఎందుకు. బలపరీక్ష మరో నిర్వహించాలి.రహస్య ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం వర్థిల్లితుంది. ఎమ్మెల్యేలను రిసార్ట్లో ఎందుకు దాచాల్సి వచ్చిందో స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









