గందరగోళం తమిళనాడు అసెంబ్లీలో..
- February 17, 2017
చెన్నై: ఎన్నో మలుపులు .. నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మాట్లాడే అవకాశం కల్పించాలని డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్య ఓటింగ్ నిర్వహించేందుకు కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో పన్నీర్సెల్వం వర్గం చీఫ్విప్గా సెమ్మలైన్ను మధుసూదన్ నియమించారు. బలపరీక్ష మరో రోజు నిర్వహించాలి
అసెంబ్లీలో డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ...
‘‘విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. తొందర ఎందుకు. బలపరీక్ష మరో నిర్వహించాలి.రహస్య ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం వర్థిల్లితుంది. ఎమ్మెల్యేలను రిసార్ట్లో ఎందుకు దాచాల్సి వచ్చిందో స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







