ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందే: డొనాల్డ్ ట్రంప్
- February 18, 2017
ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందేనని, ఉగ్రవాదులను ఓడించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను తమ ప్రభుత్వం సాధించగలదన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. 'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరికీ ముప్పే. కనుక దీనిని ప్రతిఘటించి ఉగ్రవాదులను ఓడించి తీరాలి' అని శుక్రవారం ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన వారాంతపు రేడియో ప్రసంగంలో పేర్కొన్నారు. గత వారం ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యానని, ఇజ్రాయిల్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయనకు భరోసా ఇచ్చానని ట్రంప్ తెలిపారు. మిత్రదేశాల భద్రతకు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రంప్ చెప్పారు. ఇదిలావుంటే, ఉత్తర అమెరికా సైనిక కూటమి (నాటో)కి ట్రంప్ అండగా నిలుస్తారని, ఈ విషయంలో ఆయన నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









