పాక్లో వరుస బాంబు పేలుళ్లు!
- February 21, 2017
వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్ మరోసారి దద్దరిల్లింది. పాక్ వాయవ్య ప్రాంతంలోని చార్సద్దా జిల్లా తాంగి ప్రాంతంలో ఉన్న ఓ కోర్టు ఆవరణలో మంగళవారం వరుస మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పెద్దసంఖ్యలో పలువురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు కోర్టులో దాడికి ప్రయత్నించగా.. అందులో ఇద్దరిని పోలీసులు మట్టుబెట్టారు. మరొక సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో న్యాయవాదులు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఇరుగుపొరుగుకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా తరచు విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ గత వారమంతా వరస పేలుళ్లతో హోరెత్తిన సంగతి తెలిసిందే.
లాహోర్ మొదలుకొని బలూచిస్తాన్లోని ఆవారన్ వరకూ పలు నగరాలు, పట్టణాల్లో దాదాపు పది ఉగ్రవాద దాడులు జరిగి దాదాపు 50మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గ ఘటన గత గురువారం సింద్ రాష్ట్రంలోని సెహ్వాన్లో సూఫీ మత గురువు లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థనా మందిరంలో చోటు చేసుకుంది. ఇక్కడ మానవ బాంబు జొరబడి చేసిన ఈ దాడిలో 80 మంది మరణించారు. మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









