పాక్లో వరుస బాంబు పేలుళ్లు!
- February 21, 2017
వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్ మరోసారి దద్దరిల్లింది. పాక్ వాయవ్య ప్రాంతంలోని చార్సద్దా జిల్లా తాంగి ప్రాంతంలో ఉన్న ఓ కోర్టు ఆవరణలో మంగళవారం వరుస మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పెద్దసంఖ్యలో పలువురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు కోర్టులో దాడికి ప్రయత్నించగా.. అందులో ఇద్దరిని పోలీసులు మట్టుబెట్టారు. మరొక సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో న్యాయవాదులు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఇరుగుపొరుగుకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా తరచు విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ గత వారమంతా వరస పేలుళ్లతో హోరెత్తిన సంగతి తెలిసిందే.
లాహోర్ మొదలుకొని బలూచిస్తాన్లోని ఆవారన్ వరకూ పలు నగరాలు, పట్టణాల్లో దాదాపు పది ఉగ్రవాద దాడులు జరిగి దాదాపు 50మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గ ఘటన గత గురువారం సింద్ రాష్ట్రంలోని సెహ్వాన్లో సూఫీ మత గురువు లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థనా మందిరంలో చోటు చేసుకుంది. ఇక్కడ మానవ బాంబు జొరబడి చేసిన ఈ దాడిలో 80 మంది మరణించారు. మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







