భారత్ ని తెగ పొగిడేస్తున్న చైనా..!
- February 21, 2017
భారత దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకు వెళుతుంది. భారత్ ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా భారత్ వైపు చూడటం మొదలు పెట్టాయి. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపై చైనాలో ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపే విషయంలో భారత్ తమ కంటే ముందు ఉందని చైనా పేర్కొంది. భారత్ ను స్ఫూర్తిగా తీసుకొని అంతకంటే వేగంగా ముందుకు వెళ్లాలని చైనా నిర్ణయించింది.
ఇప్పుడు భారత్ కూడా అగ్రదేశాలతో పోటీ పడుతోందని షాంఘై ఇంజినీరింగ్ సెంటర్ ఫర్ మైక్రోశాటిలైట్స్ డైరెక్టర్ జాంగ్ యోంగే చెప్పారు.
ఎప్పుడూ భారత్ పై కస్సుబుస్సులాడే చైనా తొలిసారి భారత్పై ప్రశంసలు కురింపించింది. ఇస్రో చేసిన అద్భుత ప్రయోగంపట్ల అక్కడి మీడియా భారత్ను పొగడ్తల్లో ముంచెత్తింది.
చైనా కంటే ముందుగా అంగారకగ్రహం మీదికి ఉపగ్రహాన్ని పంపిన భారత్ ఇప్పుడు సింగిల్ రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను పంపించి మంచి అవకాశాన్ని సాధించిందని జాంగ్ తెలిపారు. భారత్ గత బుధవారం సాధించిన ప్రయోగం అంతరిక్ష కార్యక్రమాల్లో దాని తాజా విజయంగానే చెప్పాలని అంగీకరించారు. 2014లో అంగారక గ్రహంపైకి ఉపగ్రహ వాహకనౌకను దిగ్విజయంగా పంపిన భారత్ ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా చరిత్రకెక్కింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







