వరదలో మునిగిపోయిన బాధితుని మృతదేహం 9 కిలోమీటర్ల దిగువ ప్రాంతంలో లభ్యం
- February 21, 2017
జెడ్డా : ఇటీవల అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలలో కారులో ప్రయాణిస్తున్న ఓ దురదృష్టవంతుడు తన వాహనంతో సహా నీటి ప్రవాహంలో అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయాడు. గత వారం అల్ మంసక్ జిల్లాలో వరదలు ఉదృతంగా రహదారిపై ప్రవహిస్తున్న వేళ కారుతో సహా రోడ్డు ఆ దరికి చేరుకోవాలనే ఆదుర్దా ఆ వ్యక్తిని అర్ధాయుష్కుడిని చేసింది. నెమ్మది నెమ్మదిగా వరద నీటిలో జారిపోయిన వాహనంతో సహా దూరంగా కొట్టుకుపోయాడు. నీట మునిగిన ప్రాంతం నుంచి 9 కిలోమీటర్ల దిగువ ప్రాంతంకు నీటిలో దొర్లుతూ పోయి ఒక చిన్ని నీటి కుంటలో తన ఆఖరి మజిలీగా నిలిచిపోయాడు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత కాగా కుళ్ళిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి మృతదేహాన్ని అభ పౌర రక్షణ సిబ్బంది మరియు స్వచ్ఛంద కార్యకర్తలు తమ అన్వేషణలో కనుగొన్నట్లు యాసిర్ ప్రాంతం పౌర రక్షణ శాఖ డైరెక్టరేట్ పౌర రక్షణ ప్రతినిధి కల్నల్ మహ్మద్ రహీం సోమవారం తెలిపారు. తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం పౌర రక్షణ రక్షకులతో పాటు, ఇతర వాలంటీర్లతో మృతుని బంధువులు నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి శరీరం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమీపంలోని మాగాణి చెరువులు మరియు బావులని తీవ్రంగా వెతికేరు.ఆరు రోజుల తర్వాత వారికి ఆ స్థితిలో బాధిత వ్యక్తి మృతదేహం చూడటంతో అందరి హృదయాలు బరువెక్కేయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!









