దుబాయిలో తెలంగాణ వాసి మృతి
- February 21, 2017
దుబాయిలో జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం తక్కళ్లపల్లి వాసి మల్లేపల్లి ఆనంద్ (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.దుబాయిలోని అల్ షఫర్ జనరల్ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ అయిన ఆనంద్ విధినిర్వహణలో భాగంగా రోడ్డువెంట ఎలక్ట్రికల్ కేబుళ్లు వేస్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టడం వలన మరణించాడు.
మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కోరుతూ జగిత్యాల మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రమేష్ బాబుతో పాటు మృతుని కుటుంబ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డిని కలిశారు. వెంటనే స్పందించిన జీవన్ రెడ్డి దుబాయిలోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 'మదద్' ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
--భీం రెడ్డి.యం
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









