రెండు రాష్ట్రాల ప్రజలను శ్రీవారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు
- February 21, 2017
తిరుపతి: తిరుమల శ్రీవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొక్కులు సమర్పించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్, అధికారులు తమ కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులకు శ్రీవారం దర్శనం బాగా చేయించారని చెప్పారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, సంతోషమని శుభాకాంక్షలు తెలిపారు.
రెండు రాష్ట్రాల ప్రజలను శ్రీవారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
ఇరు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగుతాయని అన్నారు.
హైదరాబాద్లో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించగా.. శ్రీవారికి ప్రాంతాలుండవని, శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని చెప్పారు.
ధర్మ ప్రచారానికి టీటీడీతో కలిసి ముందుకు సాగుతామని కేసీఆర్ తెలిపారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









