ఆహార చట్టం ఉల్లంఘించినవారిపై తక్షణ జరిమానా మరియు మూసివేత ప్రకతన
- February 22, 2017
జెడ్డా : ప్లాస్టిక్ సంచులలో వేడి ఆహారం ఇవ్వడం, సురక్షితం కానీ కంటైనర్లలలో పదార్ధాల దాచేందుకు ఉపయోగించరాదని అన్ని ఆహార దుకాణాలు, రెస్టారెంట్లు మరియు బేకరీలకు జెడ్డా మున్సిపాలిటీ హెచ్చరించింది. వీటిని అతిక్రమించిన వ్యాపాస్తులకు తక్షణ జరిమానాలు మరియు చట్టం ఉల్లఘించిన కారణంగా దుకాణాలను మూసివేత చర్యలు చేపడతామని ఆదివారం పురపాలక శాఖ ప్రకటించింది.ఈ మార్గ దర్శకాలను అనుసరించడానికి అన్ని దుకాణాలకు ఆఖరి గడువు ఫిబ్రవరి 28 వ తేదీ వరకు ఉంది. ఉప మున్సిపాలిటీల్లో అసిస్టెంట్ సెక్రటరీ మహమ్మద్ నసీర్ అల్ మతాబ్ మాట్లాడుతూ , జెడ్డా మున్సిపాలిటీ తమ ఆహార భద్రత మరియు భద్రతా కార్యక్రమం కింద నిబంధనలను పాటించని అనేక ఆహార దుకాణాలు మరియు రెస్టారెంట్లను ఇప్పటికే అధిక సంఖ్యలో మూసివేసినట్లు తెలిపారు. జెడ్డాలోని దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలు ఇకపై వేడి ఆహారం కోసం ప్లాస్టిక్ సంచులను మరియు కంటైనర్లు ఉపయోగించరాదని ఆయా దుకాణ నిర్వాహుకులకు ఒక సలహా ఇచ్చినట్లు చెప్పారు.తన పరీశీలనలో బేకరీ యాజమాన్యం మైక్రో ఓవెన్లు నుండి వేడి బ్రెడ్ తీసుకుని కన్వేయర్ బెల్ట్ దగ్గరగా వచ్చిన వాటిని హడావిడిగా ప్యాకింగ్ చేస్తున్నారని, ప్యాక్ చేసే ముందు బ్రెడ్లను చల్లబరచడం ఆరోగ్యరీత్యా ఎంతో మంచిదని చెప్పారు. ఈ ఆహార భద్రత మరియు భద్రతా కార్యక్రమంని నివాసితులు మరియు జెడ్డా సందర్శకుల కోసం ఆహార భద్రత మరియు నాణ్యత మెరుగు దాదాపు ఒక సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమమే విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









