ఆహార చట్టం ఉల్లంఘించినవారిపై తక్షణ జరిమానా మరియు మూసివేత ప్రకతన
- February 22, 2017
జెడ్డా : ప్లాస్టిక్ సంచులలో వేడి ఆహారం ఇవ్వడం, సురక్షితం కానీ కంటైనర్లలలో పదార్ధాల దాచేందుకు ఉపయోగించరాదని అన్ని ఆహార దుకాణాలు, రెస్టారెంట్లు మరియు బేకరీలకు జెడ్డా మున్సిపాలిటీ హెచ్చరించింది. వీటిని అతిక్రమించిన వ్యాపాస్తులకు తక్షణ జరిమానాలు మరియు చట్టం ఉల్లఘించిన కారణంగా దుకాణాలను మూసివేత చర్యలు చేపడతామని ఆదివారం పురపాలక శాఖ ప్రకటించింది.ఈ మార్గ దర్శకాలను అనుసరించడానికి అన్ని దుకాణాలకు ఆఖరి గడువు ఫిబ్రవరి 28 వ తేదీ వరకు ఉంది. ఉప మున్సిపాలిటీల్లో అసిస్టెంట్ సెక్రటరీ మహమ్మద్ నసీర్ అల్ మతాబ్ మాట్లాడుతూ , జెడ్డా మున్సిపాలిటీ తమ ఆహార భద్రత మరియు భద్రతా కార్యక్రమం కింద నిబంధనలను పాటించని అనేక ఆహార దుకాణాలు మరియు రెస్టారెంట్లను ఇప్పటికే అధిక సంఖ్యలో మూసివేసినట్లు తెలిపారు. జెడ్డాలోని దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలు ఇకపై వేడి ఆహారం కోసం ప్లాస్టిక్ సంచులను మరియు కంటైనర్లు ఉపయోగించరాదని ఆయా దుకాణ నిర్వాహుకులకు ఒక సలహా ఇచ్చినట్లు చెప్పారు.తన పరీశీలనలో బేకరీ యాజమాన్యం మైక్రో ఓవెన్లు నుండి వేడి బ్రెడ్ తీసుకుని కన్వేయర్ బెల్ట్ దగ్గరగా వచ్చిన వాటిని హడావిడిగా ప్యాకింగ్ చేస్తున్నారని, ప్యాక్ చేసే ముందు బ్రెడ్లను చల్లబరచడం ఆరోగ్యరీత్యా ఎంతో మంచిదని చెప్పారు. ఈ ఆహార భద్రత మరియు భద్రతా కార్యక్రమంని నివాసితులు మరియు జెడ్డా సందర్శకుల కోసం ఆహార భద్రత మరియు నాణ్యత మెరుగు దాదాపు ఒక సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమమే విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







