మరోసారి ఒకటైన చిరు - బాలయ్యలు
- February 23, 2017
మరోసారి మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ లు కలుసుకొని వారి ఆత్మీయాను చాటుకున్నారు. సంక్రాంతి టైములో ఇద్దరు నటించిన ఖైదీ , శాతకర్ణి చిత్రాల పోటా పోటీగా రిలీజ్ రెండు కూడా దేనికి అదే అన్నట్లు సక్సెస్ అయి , మళ్లీ ఇండస్ట్రీ కి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాయి. వీరి అభిమానులు సోషల్ మీడియా లో దాడి కి దిగిన కానీ మీమిద్దరం ప్రాణ స్నేహితులమే అన్నట్లు చిరు , బాలయ్యలు ఎప్పుడు కలిసిన చెప్పుకుంటారు. తాజాగా నిన్న రాత్రి సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ పెళ్లి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎంత మంది హాజరయి నూతన వధువు వరులను ఆశీర్వదించారు. చిరంజీవి.. బాలయ్య ఇద్దరూ హాజరవడం ఫంక్షన్ కే హెలైట్ గా నిలిచింది. ఇద్దరు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. అలాగే తదుపరి వారి సినిమాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ తన 151 వ సినిమా ఫై కసరత్తులు మొదలు పెడితే , బాలయ్య 101 సినిమాకు సంబదించిన పనుల్లో నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







