మోసుల్ విమానాశ్రయాన్ని కైవసం చేసుకున్న ఇరాకీ దళాలు
- February 23, 2017
ఫెడరల్ పోలీస్, హోం మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత ర్యాపిడ్ రెస్పాన్స్ దళాలు విమానాశ్రయంవైపు దూసుకెళ్ళాయి. భారీ ఎత్తున మోర్టార్లను కుమ్మరించాయి. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు దారి చూపుతూండగా నేలపై నుంచి సైనిక దళాలు చొచ్చుకెళ్ళాయి. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులతో ఇరాకీ దళాలకు మద్దతుగా నిలిచాయి. అమెరికా, ఇరాక్ దళాలు కలిసికట్టుగా సాయుధ వాహనాల్లో విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు దూసుకెళ్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ఆ విమానాశ్రయం మోసుల్కు దక్షిణ దిశలో ఉంది. ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విమానాల రాకపోకలు ఆగిపోయాయి.
ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ అల్ జుబూరీ మాట్లాడుతూ దేవుని దయతో ఈ రోజు (గురువారం) విమానాశ్రయంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇరాక్లో జీహాదీల ప్రాబల్యంలో ఉన్న చిట్టచివరి నగరం మోసుల్. ఈ నగరంపై పట్టు సాధించేందుకు భద్రతా దళాలు వేలాదిగా ఆదివారం ఇక్కడికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







