లాహోర్ మిలిటరీ ఏరియాలో పేలుడు, 8మంది మృతి
- February 23, 2017
పాకిస్థాన్లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. లాహోర్లోని మిలిటరీ ఏరియాలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడుకు కారణాలు తెలియరాలేదు. కాగా, జనరేటర్ బ్లాస్ట్ కావడం వల్ల పేలుడు జరిగినట్లు స్థానిక పంజాబ్ ప్రభుత్వం ట్విట్టర్లో పేర్కొంది. రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఫెన్స్ ఏరియలో ఉన్న ఓ రెస్టారెంట్లో పేలుడు జరిగినట్లు తెలిపారు. దాని వల్ల సమీపంలో ఉన్న భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన 15 మందిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ప్రాంతాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







