వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన పథకం రద్దు

- February 24, 2017 , by Maagulf
వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన పథకం రద్దు

మస్కట్ : వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన భారతదేశం మరియు బహరేన్ సంయుక్తంగా ఆర్థిక హామీ పథకంను రద్దు చేయనున్నారు. గతంలో యజమానులు చెల్లించిన వేతన బకాయిలను అరబ్ దేశంలో భారతీయ మహిళలుకు ఆ పథకం ద్వారా సాయమందించేవారు. వేలమంది వలస పని మనుష్యులను రక్షించడానికి ఉపయోగించే ఆ ఆర్థిక హామీ పథకంకు ఇకపై స్వస్తి పలకాలనే యోచన చేస్తున్నాయి. మనామా భారత దౌత్యకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఒక మిలియన్ మంది చిన్న గల్ఫ్ రాష్ర్టంలో  300,000 మంది  భారతీయ వలస కార్మికులు ఉన్నారు.వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, తోటలలో,  డ్రైవర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే,15,000 మంది మహిళలు పని మనుష్యులుగా కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. బహరేన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ రెండు దేశాల వలసపని మనుస్యులకు ఆర్థిక సాయం అందించే  పథకం రద్దు చేయాలని ఒక ప్రతిపాదనను అధ్యయనం చేసే ఈ నెల ప్రచురించిన ఒక బ్లాగ్ లో ప్రచురించారు. కానీ అందుకు సంబంధిన  మరిన్నీ వివరాలు ఇవ్వలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com