ఐసిస్ మరో దుశ్చర్య ఇరాక్లో
- February 24, 2017
బాగ్దాద్: మతాచారాలను ఇరాక్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఇద్దరు సైన్యాధికారులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవికంగా తలనరికి చంపారు. షియాల ఆధిపత్యమున్న కర్బాలా సిటీలో మంగళవారం బహిరంగంగా ఐసిస్ ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సైన్యాధికారులు అబ్బాస్ యాసిన్ హుస్సేన్, అలీ అల్-దరాజీల శిరచ్ఛేదన దృశ్యాలను వీడియో తీసి ఉగ్రవాదులు ఆన్లైన్లో పోస్టుచేశారని 'అరా న్యూస్' వార్తా వెబ్సైట్ వెల్లడించింది.
అమెరికా సహకారంతో దాడులుచేస్తున్న ఇరాక్ ప్రభుత్వబలగాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఐసిస్ ప్రకటించింది. దక్షిణ ఇరాక్లోని కర్బాలాలో ఇటీవల ఉగ్రవాదులపై సైనికదాడుల సమయంలో ఈ ఇద్దరు అధికారులు ఐసిస్కు చిక్కారు.
మరోవైపు, అబూ బకర్ అల్-సమురాయ్ పేరు గల సైన్యాధికారిని ఐసిస్ ఉగ్రవాదులు మెడకోసి చంపేసి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మృత్యువుకు దగ్గరవుతున్న చివరిక్షణంలోనూ భయంకనబడని సైన్యాధికారి వీడియో మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







