పేదవాడి ఆకలి తీర్చేందుకు నడుం బిగించిన హర్యానా

- February 24, 2017 , by Maagulf
పేదవాడి ఆకలి తీర్చేందుకు నడుం బిగించిన హర్యానా

హర్యానా ప్రభుత్వం కార్మికుల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఐదు రుపాయలకు అల్పాహారం, పది రూపాయలకు సంపూర్ణ భోజనం అందించనుంది. కార్మికులు పని చేసే చోటుకు వాహనాల ద్వారా వీటిని సమకూర్చుతారు.

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ శుక్రవారం కార్మిక మంత్రిత్వ శాఖతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అంత్యోదయ అన్న పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com