ఖతార్ లో తెలుగింటి ఆడపడచు మృతి

- February 24, 2017 , by Maagulf

ఖతార్ లో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ మృతి. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన పంతాని సత్యవతి (46) బ్రతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి ఒక అరబ్బు ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం చేస్తున్నది. గదిలో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన 6 ఫిబ్రవరి 2017 న ఆమె మృతి చెందినది. యజమాని ఇంట్లో మరో తెలుగు మహిళతో పాటు సత్యవతి ఒకే గదిలో ఉంటారు. రాత్రిపూట చలి ఉన్నందున గదిని వెచ్చబరచడానికి బొగ్గుల కుంపటిని వెలిగించారు. కుంపటిని ఆర్పేయకుండా నిద్రలోకి జారుకున్నారు. దట్టంగా వ్యాపించిన బొగ్గుల పొగను పీల్చడం వలన కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ అయి సత్యవతి మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తగిన వెంటిలేషన్ (గాలి ప్రసరణ) లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం ఈ సంఘటనకు కారణం. హైదరాబాద్ నుండి స్వగ్రామానికి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై విభాగం.​

ఎం. భీమ్ రెడ్డి​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com