ఖతార్ లో తెలుగింటి ఆడపడచు మృతి
- February 24, 2017
ఖతార్ లో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ మృతి. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన పంతాని సత్యవతి (46) బ్రతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి ఒక అరబ్బు ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం చేస్తున్నది. గదిలో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన 6 ఫిబ్రవరి 2017 న ఆమె మృతి చెందినది. యజమాని ఇంట్లో మరో తెలుగు మహిళతో పాటు సత్యవతి ఒకే గదిలో ఉంటారు. రాత్రిపూట చలి ఉన్నందున గదిని వెచ్చబరచడానికి బొగ్గుల కుంపటిని వెలిగించారు. కుంపటిని ఆర్పేయకుండా నిద్రలోకి జారుకున్నారు. దట్టంగా వ్యాపించిన బొగ్గుల పొగను పీల్చడం వలన కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ అయి సత్యవతి మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తగిన వెంటిలేషన్ (గాలి ప్రసరణ) లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం ఈ సంఘటనకు కారణం. హైదరాబాద్ నుండి స్వగ్రామానికి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై విభాగం.
ఎం. భీమ్ రెడ్డి
_1487962345.jpg)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







