ఖతార్ లో తెలుగింటి ఆడపడచు మృతి
- February 24, 2017
ఖతార్ లో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ మృతి. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన పంతాని సత్యవతి (46) బ్రతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి ఒక అరబ్బు ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం చేస్తున్నది. గదిలో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన 6 ఫిబ్రవరి 2017 న ఆమె మృతి చెందినది. యజమాని ఇంట్లో మరో తెలుగు మహిళతో పాటు సత్యవతి ఒకే గదిలో ఉంటారు. రాత్రిపూట చలి ఉన్నందున గదిని వెచ్చబరచడానికి బొగ్గుల కుంపటిని వెలిగించారు. కుంపటిని ఆర్పేయకుండా నిద్రలోకి జారుకున్నారు. దట్టంగా వ్యాపించిన బొగ్గుల పొగను పీల్చడం వలన కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ అయి సత్యవతి మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తగిన వెంటిలేషన్ (గాలి ప్రసరణ) లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం ఈ సంఘటనకు కారణం. హైదరాబాద్ నుండి స్వగ్రామానికి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై విభాగం.
ఎం. భీమ్ రెడ్డి
_1487962345.jpg)
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









