ఖతార్ లో తెలుగింటి ఆడపడచు మృతి
- February 24, 2017
ఖతార్ లో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ మృతి. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన పంతాని సత్యవతి (46) బ్రతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లి ఒక అరబ్బు ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం చేస్తున్నది. గదిలో బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వలన 6 ఫిబ్రవరి 2017 న ఆమె మృతి చెందినది. యజమాని ఇంట్లో మరో తెలుగు మహిళతో పాటు సత్యవతి ఒకే గదిలో ఉంటారు. రాత్రిపూట చలి ఉన్నందున గదిని వెచ్చబరచడానికి బొగ్గుల కుంపటిని వెలిగించారు. కుంపటిని ఆర్పేయకుండా నిద్రలోకి జారుకున్నారు. దట్టంగా వ్యాపించిన బొగ్గుల పొగను పీల్చడం వలన కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ అయి సత్యవతి మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తగిన వెంటిలేషన్ (గాలి ప్రసరణ) లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం ఈ సంఘటనకు కారణం. హైదరాబాద్ నుండి స్వగ్రామానికి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై విభాగం.
ఎం. భీమ్ రెడ్డి
_1487962345.jpg)
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









